Studio18 News - ANDHRA PRADESH / Tirupati : తిరుమల : తిరుమల ( Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని 85,823 మంది భక్తులు దర్శించుకోగా 23,660 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ.4.80 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. నిన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 13 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
Admin
Studio18 News