Friday, 14 November 2025 05:57:56 AM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

Chandrababu Naidu: ఏపీలో 11 మంది ఐఏఎస్‌ల బదిలీ... టీటీడీకి కొత్త ఈవో

Date : 08 September 2025 07:38 PM Views : 132

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ లకు స్థానచలనం టీటీడీ నూతన ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకం ప్రస్తుత ఈవో శ్యామలరావు జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు పనితీరు ఆధారంగా బదిలీలు చేపట్టిన ప్రభుత్వం పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగింత ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ బదిలీలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా సీనియర్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా పనిచేస్తున్న శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబును నియమించారు. రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేశ్ కుమార్ మీనా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్, అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే బాధ్యతలు చేపట్టనున్నారు. ఇతర ముఖ్య నియామకాల్లో భాగంగా, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్‌ను, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్‌ను ప్రభుత్వం నియమించింది. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్, పరిశ్రమలు, కార్మిక శాఖ కమిషనర్‌గా శేషగిరిబాబును నియమించారు. ఎండోమెంట్ రెవెన్యూ కార్యదర్శిగా హరి జవహర్‌లాల్‌కు బాధ్యతలు అప్పగించారు. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఐఏఎస్ అధికారుల పనితీరుపై సమీక్షలు జరిపారు. పరిపాలనలో వేగం పెంచేందుకు, అధికారుల పనితీరును మెరుగుపరిచేందుకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పనితీరును ప్రామాణికంగా తీసుకుని, సమర్థులైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించాలనే లక్ష్యంతో ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :