Friday, 14 November 2025 04:31:40 AM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు

Date : 13 November 2025 07:14 PM Views : 13

Studio18 News - ANDHRA PRADESH / Visakhapatnam : విశాఖలో రేపటి నుంచి సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సు సదస్సుకు ముందే పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశాలు ఈ సాయంత్రం పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం యూరప్ దేశాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఎం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతోనూ భేటీలు ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. విశాఖపట్నం వేదికగా రేపు, ఎల్లుండి (శుక్ర, శనివారాలు) జరగనున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం సర్వం సిద్ధమైంది. ఈ సదస్సు ప్రారంభానికి ఒక రోజు ముందే సీఎం చంద్రబాబు గురువారం పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులతో వరుస సమావేశాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సాయంత్రం ఆయన సమక్షంలో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకోనుంది. ఇవాళ‌ ఉదయం 10 గంటలకు నగరంలోని నోవోటెల్ హోటల్‌లో జరిగిన "పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్: ఇండియా - యూరోప్ కోపరేషన్ ఫర్ సస్టెయినబుల్ గ్రోత్" అనే అంశంపై సీఎం చంద్రబాబు ఇండియా-యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్ షిఫ్ట్, సుస్థిర ఆవిష్కరణలు, ఏపీలో యూరోపియన్ పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై పారిశ్రామిక ప్రతినిధులతో ఆయన విస్తృతంగా చర్చించారు. మధ్యాహ్నం నుంచి సీఎం చంద్రబాబు పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ దేశాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. అనంతరం ఎస్పీపీ పంప్స్ లిమిటెడ్ ఎండీ అలోక్ కిర్లోస్కర్, రెన్యూ పవర్ చైర్మన్ సుమిత్ సిన్హా, యాక్షన్ టెసా గ్రూప్ ఛైర్మన్ ఎన్.కె. అగర్వాల్‌తో సమావేశమవుతారు. వీటితో పాటు మురుగప్ప గ్రూప్ ఛైర్మన్ అరుణ్ అలగప్పన్, కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎండీ శంకర్ సుబ్రహ్మణియన్, జూల్ గ్రూప్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఛైర్మన్ రాహుల్ ముంజాల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలతోనూ చంద్రబాబు చర్చలు జరపనున్నారు. ఈ సమావేశాల అనంతరం సాయంత్రం జరగనున్న ‘వైజాగ్ ఎకనమిక్ రీజియన్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత సీఐఐ నేషనల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి కూడా హాజరుకానున్నారు. ఈ వరుస భేటీలు, ఒప్పందాలు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో దోహదపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :