Friday, 14 November 2025 04:31:02 AM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

ap free sand policy: గృహ నిర్మాణదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ .. ఇసుక సీనరేజ్ ఎత్తివేత

Date : 19 October 2024 12:46 PM Views : 3648

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో గృహ నిర్మాణ దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రీచ్‌ (ఇసుక క్వారీ)ల నుంచి సొంత అవసరాలకు ట్రాక్టర్‌ల ద్వారా కూడా ఉచితంగా ఇసుకను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రభుత్వం ఈ మార్పులు చేస్తూ సవరణ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రజలు సొంత అవసరాలకు గతంలో రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్ల బండ్లకు మాత్రమే అనుమతి ఉండేది. ఇప్పటి నుంచి ఎడ్ల బండ్లతో పాటు ట్రాక్టర్‌లోనూ ఇసుకను తీసుకుని వెళ్లేందుకు అనుమతి నిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. స్థానిక అవసరాలకు మాత్రమే ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లల్లో ఇసుకను తీసుకెళ్లవచ్చని సవరణ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే ఇసుకపై సీనరేజ్ వసూళ్లు కూడా ఎత్తివేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. లారీల్లో 40 టన్నులకు మించి ఉన్నా అధిక లోడ్ జరిమానాలు ఉండవని సీఎం వెల్లడించారు. టీటీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల గృహ నిర్మాణ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోడింగ్, రవాణా ఖర్చులతోనే ఇసుక తరలించుకునే వెసులుబాటు గృహ నిర్మాణదారులకు కలుగుతుంది. దీంతో ఇకపై ఇసుక ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :