Tuesday, 30 December 2025 05:10:31 AM
# Vaikunta Ekadasi | వారాసిగూడలో వైకుంఠ ఏకాదశి వెలుగులు.. దేదీప్యమానంగా శ్రీ కల్యాణ వెంకటేశ్వరుడి ఆలయం..! # Tirumala | తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం # Man Harassing Woman | మాల్‌లో మహిళ పట్ల అసభ్యకర ప్రవర్తన.. డెలివరీ మ్యాన్‌ అరెస్ట్‌ # Respiratory Diseases | చ‌లికాలంలో శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గాలంటే.. ఇలా చేయాలి.. # Raja Saab | డార్లింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్‌కు చెక్.. ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రిలీజ్ ట్రైలర్ అదిరిపోయింది # Melbourne Cricket Ground: మెల్‌బోర్న్ పిచ్ అసంతృప్తిక‌రం.. రేటింగ్ ఇచ్చిన ఐసీసీ # KCR | కేసీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల # Pop Corn | పాప్ కార్న్ అస‌లు మ‌న ఆరోగ్యానికి మంచిదేనా..? దీన్ని తింటే ఏం జ‌రుగుతుంది..? # Doug Bracewell | క్రికెట్‌కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ దిగ్గజం.. కారణమిదే..! # Acne | అస‌లు మ‌న‌కు మొటిమ‌లు ఎందుకు వ‌స్తాయి..? అవి ఏర్ప‌డ‌డానికి కార‌ణాలు ఏమిటి..? # OTT Movies | న్యూ ఇయర్ & సంక్రాంతి స్పెషల్‌గా సినిమా హంగామా.. థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న మూవీస్ ఇవే! # Cricket | అండర్‌-19 రాష్ట్ర క్రికెట్‌ జట్టుకు వరంగల్‌కు చెందిన సహస్రరాజ్‌ ఎంపిక # AP Cabinet | ఏపీలో కొత్తగా మరో మూడు జిల్లాల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం # Mexico Train Derailment | మెక్సికోలో పట్టాలు తప్పిన రైలు.. 13 మంది మృతి, 98 మందికి గాయాలు # Amelia Kerr | టీ20ల్లో ముంబై స్టార్ విధ్వంసం.. 59 బంతుల్లోనే సెంచరీ..! # Kuldeep Sengar: కుల్దీప్ సెంగర్‌కు మరణశిక్ష పడేవరకు నా పోరాటం ఆగదు: ఉన్నావ్ బాధితురాలు # Qari Yaqoob Sheikh: పాకిస్థాన్ లో కొత్త టెర్రరిస్ట్ లీడర్.. హఫీజ్, మసూద్ పనికిరారని భావిస్తున్న పాక్ ప్రభుత్వం # Hyderabad | మూడు అంతస్తుల భవనం పై నుంచి దూకి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం # India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మూడో టీ20... విద్యార్థులకు తక్కువ ధరకే టికెట్లు! # 'దండోరా' సినిమా రివ్యూ

Elon Musk: ఇది మంచిది కాదు... వెండి ధరల పెరుగుదలపై ఎలాన్ మస్క్ ఆందోళన

Date : 29 December 2025 07:10 PM Views : 27

Studio18 News - అంతర్జాతీయం / : పారిశ్రామిక అవసరాలకు వెండి చాలా కీలకమని వ్యాఖ్య ఈ ఏడాది ఏకంగా 158 శాతం మేర పెరిగిన వెండి ధరలు స్పెక్యులేటివ్ ట్రేడింగ్, పెరిగిన డిమాండ్ వల్లే ధరల పెరుగుదల ప్రపంచ మార్కెట్లలో వెండి ధరలు రికార్డు స్థాయిలో పరుగులు పెట్టడంపై టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామిక అవసరాలకు వెండి చాలా కీలకమైందని, అయితే ఈ స్థాయిలో ధరలు పెరగడం మంచిది కాదని ఆయన హెచ్చరించారు. "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలకు వెండి అవసరం" అని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' లో పోస్ట్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీలో వెండిని ఎక్కువగా వినియోగిస్తారు. టెస్లా అధినేత అయిన మస్క్ ఆందోళన వెనుక ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఔన్సుకు 79 డాల‌ర్ల‌ వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు స్పాట్ మార్కెట్లో ఏకంగా 84 డాల‌ర్ల రికార్డు స్థాయిని తాకి, లాభాల స్వీకరణ కారణంగా 8 శాతం మేర పడిపోయింది. అయినప్పటికీ ఈ ఏడాదిలో ఇప్పటివరకు వెండి సుమారు 158 శాతం పెరిగింది. పారిశ్రామిక డిమాండ్ విపరీతంగా పెరగడం, సరఫరాలో కొరత, స్పెక్యులేటివ్ పెట్టుబడులు వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లలో వెండి వాడకం పెరగడంతో నిల్వలు తగ్గుతున్నాయి. మస్క్ ఆందోళనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. "ఎలాన్ మస్క్ కూడా ఆందోళన చెందుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు" అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ఇక, భారత మార్కెట్లోనూ వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఎంసీఎక్స్ (MCX)లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ. 2,49,282 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తన నివేదికలో వెండి ధరలు అధికంగా పెరిగాయని, భవిష్యత్తులో దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :