Tuesday, 30 December 2025 06:47:28 AM
# Vaikunta Ekadasi | వారాసిగూడలో వైకుంఠ ఏకాదశి వెలుగులు.. దేదీప్యమానంగా శ్రీ కల్యాణ వెంకటేశ్వరుడి ఆలయం..! # Tirumala | తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం # Man Harassing Woman | మాల్‌లో మహిళ పట్ల అసభ్యకర ప్రవర్తన.. డెలివరీ మ్యాన్‌ అరెస్ట్‌ # Respiratory Diseases | చ‌లికాలంలో శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గాలంటే.. ఇలా చేయాలి.. # Raja Saab | డార్లింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్‌కు చెక్.. ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రిలీజ్ ట్రైలర్ అదిరిపోయింది # Melbourne Cricket Ground: మెల్‌బోర్న్ పిచ్ అసంతృప్తిక‌రం.. రేటింగ్ ఇచ్చిన ఐసీసీ # KCR | కేసీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల # Pop Corn | పాప్ కార్న్ అస‌లు మ‌న ఆరోగ్యానికి మంచిదేనా..? దీన్ని తింటే ఏం జ‌రుగుతుంది..? # Doug Bracewell | క్రికెట్‌కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ దిగ్గజం.. కారణమిదే..! # Acne | అస‌లు మ‌న‌కు మొటిమ‌లు ఎందుకు వ‌స్తాయి..? అవి ఏర్ప‌డ‌డానికి కార‌ణాలు ఏమిటి..? # OTT Movies | న్యూ ఇయర్ & సంక్రాంతి స్పెషల్‌గా సినిమా హంగామా.. థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న మూవీస్ ఇవే! # Cricket | అండర్‌-19 రాష్ట్ర క్రికెట్‌ జట్టుకు వరంగల్‌కు చెందిన సహస్రరాజ్‌ ఎంపిక # AP Cabinet | ఏపీలో కొత్తగా మరో మూడు జిల్లాల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం # Mexico Train Derailment | మెక్సికోలో పట్టాలు తప్పిన రైలు.. 13 మంది మృతి, 98 మందికి గాయాలు # Amelia Kerr | టీ20ల్లో ముంబై స్టార్ విధ్వంసం.. 59 బంతుల్లోనే సెంచరీ..! # Kuldeep Sengar: కుల్దీప్ సెంగర్‌కు మరణశిక్ష పడేవరకు నా పోరాటం ఆగదు: ఉన్నావ్ బాధితురాలు # Qari Yaqoob Sheikh: పాకిస్థాన్ లో కొత్త టెర్రరిస్ట్ లీడర్.. హఫీజ్, మసూద్ పనికిరారని భావిస్తున్న పాక్ ప్రభుత్వం # Hyderabad | మూడు అంతస్తుల భవనం పై నుంచి దూకి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం # India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మూడో టీ20... విద్యార్థులకు తక్కువ ధరకే టికెట్లు! # 'దండోరా' సినిమా రివ్యూ

Pakistan government: పాకిస్థాన్ ప్రభుత్వంపై ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం సంచలన ఆరోపణలు

Date : 19 November 2025 07:47 PM Views : 86

Studio18 News - అంతర్జాతీయం / : తమ ప్రావిన్స్ లో ప్రభుత్వమే ఉగ్ర దాడులు చేయిస్తోందని ఆరోపించిన ముఖ్యమంత్రి ఆఫ్ఘనిస్థాన్ – ఖైబర్ ప్రావిన్స్ మధ్య సంబంధాలను చెడగొట్టడమే ప్రభుత్వ లక్ష్యం శాంతి ప్రయత్నాలను అడ్డుకునేందుకే దాడులు చేయిస్తోందని మండిపాటు పాకిస్థాన్ ప్రభుత్వంపై ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి సోహైల్‌ అఫ్రిది సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రావిన్స్ లో పాకిస్థాన్ ప్రభుత్వమే ఉగ్ర దాడులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్థాన్ తో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ కు సత్సంబంధాలు నెలకొనడంపై ఇస్లామాబాద్ ఆగ్రహంగా ఉందని, దీనిని చెడగొట్టడానికే ఖైబర్ ప్రావిన్స్ లో ఉగ్ర వాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన మండిపడ్డారు. శాంతి ప్రయత్నాలను, చర్చలను అడ్డుకోవడమే దీని వెనకున్న అసలు ఉద్దేశమని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం సోహైల్ అఫ్రిదిని ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. శాంతి ప్రయత్నాలను అడ్డుకోవడానికే.. సోహైల్ అఫ్రిది కిందటి నెలలోనే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందిన నేత. ఇటీవలి కాలంలో ఖైబర్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంటున్న ఉగ్ర దాడులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పాక్ ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇటీవల పష్తూన్‌ తహాఫుజ్‌ మూమెంట్‌ (పీటీఎం) సభ్యులు కిడ్నాప్ కు గురైనట్లు తెలుస్తోంది. దీనిని అఫ్రిది తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రపంచ దేశాలు సహించకూడదని ఆయన పేర్కొన్నారు. శాంతి ప్రయత్నాలకు భంగం కలిగించేవారిని ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తామని సోహైల్ అఫ్రిది హెచ్చరించారు. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో.. పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో సైనిక బలగాలు సామాన్యులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని సీఎం అఫ్రిది ఆరోపించారు. ఉగ్రవాదుల ఏరివేత పేరుతో సైనికులు సామాన్యులపై దౌర్జన్యం చేస్తున్నారని, సొంత ప్రజలనే చంపేస్తున్నారని విమర్శించారు. కాగా, పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ లోని తిరా లోయలో ఇటీవల పాక్‌ వైమానిక దాడులు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారని వార్తలు వెలువడ్డాయి. సొంత ప్రజలపైనే పాక్ సైన్యం దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనను ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం సోహైల్ అఫ్రిది గుర్తు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :