Friday, 14 November 2025 04:29:02 AM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

Mitchell Starc: ఐపీఎల్ వేలంలో రికార్డును బద్దలు కొట్టబోయే ముగ్గురు భారత క్రికెటర్లు వీరేనా?

Date : 28 August 2024 12:15 PM Views : 1708

Studio18 News - క్రీడలు / : ఐపీఎల్ 2025 సీజన్‌ ఆరంభానికి చాలా సమయం ఉంది. అయితే ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించిన సందడి మొదలైంది. ఐపీఎల్ 2022 మెగా వేలం తర్వాత తిరిగి మరోసారి జరగనున్న ఈ మెగా వేలంపై ఫ్రాంచైజీలు దృష్టిసారించాయి. భవిష్యత్తు జట్టును సిద్ధం చేసేందుకు యాజమాన్యాలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి. బీసీసీఐ నిబంధనలు, ఏయే ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకోవాలనే అంశాలపై యాజమాన్యాలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయి. మెగా వేలం నిర్వహించడం సరికాదంటూ కొన్ని ఫ్రాంచైజీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వేలం జరగడం ఖాయమైంది. దీంతో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఎవరు నిలవనున్నారు? ఎవరు ఏ జట్టుకు ఆడబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. గత ఐపీఎల్ సీజన్‌కు ముందు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచి రికార్డు నెలకొల్పాడు. ఏకంగా రూ.24.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని దక్కించుకుంది. మరి ఈ రికార్డు మెగా వేలంలో బద్దలు కానుందా? స్టార్క్ రికార్డును భారతీయ క్రికెటర్లు ఎవరైనా బద్దలు కొట్టనున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. మిచెల్ స్టార్క్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్న ముగ్గురు భారతీయ క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మయాంక్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ యాజమాన్యం కెప్టెన్సీ నుంచి తొలగించింది. దీంతో ఫ్రాంచైజీని వీడవచ్చంటూ కథనాలు వెలువడుతున్నాయి. బ్యాటింగ్ పరంగా అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో అతడి కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశాలు ఉన్నాయి. ఇక వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌పై కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్ను వేసే సూచనలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పంత్ మంచి ఫామ్‌లో ఉండడమే దీనికి కారణంగా ఉంది. గత ఐపీఎల్‌తో పాటు టీ20 ప్రపంచ కప్ 2024లో కూడా అతడు రాణించాడు. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్ కు కూడా భారీ ధర పలుకొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత సీజన్‌లో అతడు ఏకంగా 156.7 కి.మీ.ల వేగంతో బంతిని విసిరి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :