Friday, 14 November 2025 04:31:39 AM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

Red Fort Blast: ఎర్రకోట పేలుడు ఉగ్రచర్యే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం

Date : 13 November 2025 07:08 PM Views : 12

Studio18 News - జాతీయం / : దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ప్రమేయం అరెస్టయిన డాక్టర్ల ఫోన్లలో పాక్ హ్యాండ్లర్లతో టెలిగ్రామ్ చాట్స్ ఫరీదాబాద్ మాడ్యూల్ పట్టుబడటంతోనే పేలుడు జరిగిందన్న అనుమానాలు అరెస్టయిన డాక్టర్లు టర్కీలో పర్యటించినట్లు నిర్ధారించిన అధికారులు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం "ఉగ్రచర్య"గా అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భద్రతా కమిటీ సమావేశం అనంతరం ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. "నవంబర్ 10వ తేదీ సాయంత్రం ఎర్రకోట వద్ద కారు పేలుడు రూపంలో దేశ వ్యతిరేక శక్తులు ఘోరమైన ఉగ్రదాడికి పాల్పడ్డాయి. ఉగ్రవాదంపై దాని అన్ని రూపాల్లోనూ జీరో టాలెరెన్స్ విధానానికే భారత్ కట్టుబడి ఉందని కేబినెట్ పునరుద్ఘాటిస్తోంది" అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే యూఏపీఏ, ఉగ్రవాద నిరోధక చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. వెలుగులోకి జైషే కోణం ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమవుతున్నాయి. అరెస్టయిన డాక్టర్ల ఫోన్లలోని టెలిగ్రామ్ చాట్ల ద్వారా ఈ ఘటన వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. పాకిస్థాన్‌లోని జైషే హ్యాండ్లర్లతో వీరు టెలిగ్రామ్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు ప్రాథమిక విశ్లేషణలో తేలిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. భయంతోనే పేలుడు జరిగిందా? ఇది ప్రణాళిక ప్రకారం జరిగిన దాడా? లేక భయంతో చేసిన పేలుడా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఫరీదాబాద్‌లో ఓ ఉగ్రవాద మాడ్యూల్‌ను పోలీసులు పట్టుకున్న తర్వాత, భయంతోనే ఉగ్రవాదులు ఈ పేలుడుకు పాల్పడి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఫరీదాబాద్‌లో అరెస్టయిన వారికి, ఈ కేసులో అనుమానితుడైన డాక్టర్ ఉమర్‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఉన్నత విద్యావంతులైన డాక్టర్లు, తీవ్రవాద భావజాలంతో ప్రభావితమైన నెట్‌వర్క్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఛేదించారు. టర్కీ పర్యటన నిర్ధారణ ఈ క్రమంలోనే, అనుమానితులు డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనాయీ 2022లో టర్కీ వెళ్లినట్లు అధికారులు ధ్రువీకరించారు. అక్కడ తమ హ్యాండ్లర్లతో వీరు సమావేశమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, అరెస్టయిన డాక్టర్ షాహీన్ షాహిద్ మాజీ భర్త డాక్టర్ జాఫర్ హయత్ మీడియాతో మాట్లాడుతూ... ఆమె జీవితం ఇలా మలుపు తిరుగుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాన్పూర్‌లోని ఓ ఆస్పత్రిలో కంటి వైద్యుడిగా పనిచేస్తున్న ఆయన, తమకు 2003లో వివాహమైందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. "ఆస్ట్రేలియా లేదా యూరప్ వెళ్దామని షాహీన్ పట్టుబట్టేది, కానీ నేను ఇక్కడే ఉండాలనుకున్నాను. ఓ రోజు ఉన్నట్టుండి ఆమె మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. 2015లో విడాకులు తీసుకున్నాం, ఆ తర్వాత తిరిగి రాలేదు" అని ఆయన వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :