Friday, 14 November 2025 04:31:40 AM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

Radisson Hotel Delhi: ఢిల్లీలోని రాడిసన్ హోటల్ సమీపంలో భారీ శబ్దం.. బాంబు పేలిందని జనం భయాందోళనలు

Date : 13 November 2025 07:00 PM Views : 16

Studio18 News - జాతీయం / : హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైరింజన్లు వాహనాలను దారి మళ్లించి క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు బస్ టైర్ పేలడంతోనే శబ్దం వచ్చిందని తేలడంతో ఊపిరి పీల్చుకున్న జనం ఢిల్లీలోని రాడిసన్ హోటల్ వద్ద గురువారం ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. దీంతో మరో పేలుడు జరిగిందని జనం వణికిపోయారు. ఓ మహిళ ఫోన్ చేయడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. వాహనాల రాకపోకలను దారిమళ్లించి ఘటనా స్థలంలో క్షుణ్ణంగా పరిశోధించగా.. బస్ టైర్ పేలడం వల్లే భారీ శబ్దం వచ్చిందని తేలింది. దీంతో స్థానికులతో పాటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాకు ఓ స్టేట్ మెంట్ విడుదల చేశారు. అందులో వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం ఓ మహిళ ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేసింది. తాను గురుగ్రామ్ వెళుతుండగా మహిపాల్ పూర్ ఏరియాలోని రాడిసన్ హోటల్ సమీపంలో పేలుడు శబ్దం వినిపించిందని తెలిపింది. దీంతో తమ సిబ్బంది, ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, అక్కడ ఎలాంటి అనుమానాస్పద ఘటన జరిగినట్లు కనిపించలేదని చెప్పారు. స్థానికులను, వాహనదారులను ఆరా తీయగా ఓ గార్డు అసలు విషయం వెల్లడించాడని తెలిపారు. ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన ఓ బస్సు ఆ మార్గంలో వెళుతుండగా వెనక టైరు పేలిపోయిందని, దీంతో భారీ శబ్దం వచ్చిందని చెప్పాడన్నారు. అనంతరం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పేలుడు జరగలేదని నిర్ధారించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :